కరోనా వైరస్ తో ప్రజలంతా ఇంటికే పరిమితం అవుతుంటే
వన్యమృగాలు మాత్రం రోడ్లపైన ఇష్టానుసారంగా సంచరిస్తున్నాయి మొన్నటి వరకు తిరుపతిలో
కూడా సంచరించిన వన్యమృగాలు, సాధారణ జంతువులు తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా క్రూర
మృగాలు సైతం రోడ్డు ఎక్కుతూ గ్రామాల్లోకి సైతం వస్తున్నాయి.
తాజాగా యూపీ రాష్ట్రంలోనే గ్రామీణ అటవీ ప్రాంతంలో
పెద్దపులి దాడి చేసిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఘటనలో ఆ గ్రామానికి
చెందిన రామ్ బహదూర్, ఉజాగర్ సింగ్, లలిత ప్రసాద్, అనే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డరు
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఇంతలో
ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ వారు సమీప గ్రామానికి రావడానికి
నాలుగు గంటల సమయం పట్టింది అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గ్రామానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ
పెద్దపులి ని ఎలాగో బందించి తిసుకేల్తుండగా అది మళ్ళీ తప్పించుకొని గ్రామస్తులు పై
దాడి చేసి దాడి చేసింది, అంతే కాదు అది తప్పించుకొని అడవిలోకి పారిపోయింది దాంతో ఆ
గ్రామస్తులు తమ గ్రామం చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని ఫారెస్ట్ అధికారులకు
చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదని మీడియా ముందు విన్నవించుకున్నారు...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి